డిజిటల్ ప్లాట్‌ఫాంలో కీర్తి సురేష్ కొత్త సినిమా!


కరోనా వైరస్ కారణంగా సినిమా ఇండస్ట్రీలోని చిన్న నిర్మాతలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఫైనాన్షియర్ల దగ్గర నుంచి తెచ్చిన డబ్బుతో తీసిన సినిమాలు ఇప్పటికే విడుదలకు సిద్ధమయ్యాయి. కానీ థియేటర్లలోకి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఫైనాన్షియర్ల దగ్గర నుంచి తెచ్చిన డబ్బుకు వడ్డీలు కట్టలేక తలబాదుకుంటున్నారు. ఇక చేసేది ఏమి లేక  నిర్మాతలు డిజిటల్ ప్లాటుఫామ్ లో వారి సినిమాలు విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ‘అమృతరామమ్’ అనే తెలుగు సినిమా నేరుగా ఓటీటీలో విడుదలైపోయింది. జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన ‘పొన్మగల్ వందాల్’  అనే తమిళ సినిమా కూడా ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పుడు కీర్తి సురేష్ సినిమా అదే బాటలో  వెళ్తోంది.

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో  నియతించిన చిత్రం ‘పెంగ్విన్’. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన చిత్రం ‘పేట’ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వం వహించారు. కాల్ రామన్, కార్తికేయన్ సంతానం, కళ్యాణ్ సుబ్రమణియన్,  ఎస్.సోమసేగెర్,  సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. ‘పెంగ్విన్’ సినిమా ఈ వేసవికి విడుదల కావాల్సి ఉంది. కానీ, లాక్‌డౌన్ కారణంగా కుదరలేదు. అందుకే, ఇప్పుడు ఓటీటీలో విడుదల చేస్తున్నారని చెన్నై వర్గాల సమాచారం.



తమిళం, తెలుగు వర్షన్లను ఒకేసారి ‘పెంగ్విన్’ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేయడానికి నిర్మాతలు ఒప్పందం కుదుర్చుకున్నారని అంటున్నారు. జూన్‌లో అమెజాన్‌లో ‘పెంగ్విన్’ సినిమా ప్రీమియర్స్ పడనున్నాయని టాక్. కానీ, చిత్ర యూనిట్ దీనిపై ఇంకా స్పందించలేదు. అధికారిక ప్రకటన వచ్చేంత వరకు దీనిలో నిజమెంతో తెలియదు. ఈ ‘పెంగ్విన్’ సినిమాలో కీర్తి సురేష్ గర్భవతిగా కనిపించనున్నారు. ఆమె చుట్టూనే కథ తిరుగుతుంది. క్రైం థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంది. అందులో కీర్తి సురేష్ ఆకారం పెంగ్విన్ పక్షిలానే ఉండటం విశేషం.

0/Post a Comment/Comments

Previous Post Next Post